ఎట్టకేలకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు షురూ!
ABN , First Publish Date - 2021-11-28T06:22:56+05:30 IST
ఆర్టీపీసీఆర్ కిట్ల కొరతను తీర్చేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
శ్రీకాళహస్తి, నవంబరు 27: ఆర్టీపీసీఆర్ కిట్ల కొరతతో కొవిడ్ పరీక్షలకు బ్రేక్ పడడంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయమై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీంతో జిల్లా టీబీ నియంత్రణ అధికారి, ఆర్టీపీసీఆర్ కిట్ల సరఫరా ఇన్చార్జి రమేష్ స్పందించారు. ఆ మేరకు.. జిల్లాలో శ్వాబ్ పరీక్షలు ఆగిన పీహెచ్సీలు, అర్బన్ కేంద్రాల వివరాలపై ఆయన వైద్యాధికారులతో ఆరా తీశారు. అనంతరం అత్యవసర పరిస్థితుల కోసం భద్రపరిచిన(బఫర్ స్టాక్) నిల్వల నుంచి ఆయా ఆరోగ్యకేంద్రాలకు ఆర్టీపీసీఆర్ కిట్ల సరఫరాకు చర్యలు తీసుకున్నారు. ఎట్టకేలకు ఉన్నతాధికారుల చొరవతో వారంరోజుల తర్వాత శ్రీకాళహస్తిలోని రెండు అర్బన్హెల్త్ సెంటర్లలో శ్వాబ్ నమూనాల సేకరణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ ఇన్చార్జి చంద్రమోహన్, డాక్టర్ గిరిజా ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.