సామాజిక సమస్యలను ఎత్తిపట్టిన ‘రుబిడి’ కథలు
ABN , First Publish Date - 2021-03-01T04:48:31+05:30 IST
సామాజిక సమస్యలను ఎత్తిపట్టిన కవితా సంపుటే ‘రుబిడి’ కథలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు డి.రాఘవాచారి అన్నారు.
- పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి
నాగర్కర్నూల్ టౌన్, ఫిబ్రవరి 28: సామాజిక సమస్యలను ఎత్తిపట్టిన కవితా సంపుటే ‘రుబిడి’ కథలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు డి.రాఘవాచారి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని లిటిల్ప్లవర్ స్కూల్లో పూలే అంబేడ్కర్ అధ్యయన వేదిక ఆధ్వర్యం లో నిర్వహించిన రుబిడి పుస్తకావిష్కరణ కార్యక్ర మానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కవితా సంపుటిని ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రపంచీకరణ వ్యాప్తి ప్రజల జీవితాలను ఎలా నాశనం చేశాయో ఈ కథలు పట్టించాయని పేర్కొన్నారు. పూలే అంబేడ్కర్ అధ్యాయన వేదిక అధ్యక్షుడు గుడి పల్లి నిరంజన్, నెలపొడుపు వేదిక గౌరవ అధ్యక్షుడు కందికొం డ మోహన్, కవులు వహీద్ఖాన్, వెంకటపవార్, బాటసారి, జానయ్య, గోవర్దన్, బాలరాజు, ఇద్రిస్ తదితరులు పాల్గొన్నారు.