కాశీ విశ్వేశ్వరునికి రుద్రాభిషేకం

ABN , First Publish Date - 2021-03-09T04:55:22+05:30 IST

మండలంలోని శివాలపల్లెలో వెలసిన కాశీ విశ్వేశ్వరునికి పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి ఆధ్వర్యంలో సోమవారం రుద్రాభిషేకం నిర్వహించారు.

కాశీ విశ్వేశ్వరునికి రుద్రాభిషేకం

చెన్నూరు, మార్చి 8: మండలంలోని శివాలపల్లెలో వెలసిన కాశీ విశ్వేశ్వరునికి పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి ఆధ్వర్యంలో సోమవారం రుద్రాభిషేకం నిర్వహించారు. కృష్ణపక్ష దశమి చివరి సోమవారం సందర్భంగా కాశీవిశ్వేశ్వరునికి రుద్రాభిషేకం చేసినట్లు పీఠాధిపతి తెలిపారు. దక్షిణ కాశీగా పేరొందిన ఈ ఆలయం పవిత్రమైన పెన్నానది వడ్డున ఉండి ఎన్నో వందల సంవత్సరాల చరిత్రతో మహిమాన్విత ఆలయంగా విలసిల్లుతోందని, అలాంటి ఆలయంలో శివుడు దక్షిణ ముఖంగా ఉండడం విశేషమన్నారు. కార్యక్రమంలో కడప మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఇందిరెడ్డి శివారెడ్డి, సుబ్బారెడ్డి, ఎల్వీ సుబ్బారెడ్డి, ఆర్‌సీ కొండారెడ్డి, సుదర్శనరెడ్డి, ఆదిమూలం శివయ్యయాదవ్‌, లక్ష్మీకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T04:55:22+05:30 IST