నెలాఖరులోగా కమాండ్ కంట్రోల్ ట్రయల్ రన్
ABN , First Publish Date - 2022-07-01T07:01:35+05:30 IST
స్మార్ట్సిటీ నిధులు 95 కోట్లతో నగరంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను జూలై నెలాఖరులోగా ట్రయల్రన్ నిర్వహించి, ఆగస్టు 15న ప్రారంభిస్తామని నగర మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు.
కరీంనగర్ టౌన్, జూన్ 30: స్మార్ట్సిటీ నిధులు 95 కోట్లతో నగరంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను జూలై నెలాఖరులోగా ట్రయల్రన్ నిర్వహించి, ఆగస్టు 15న ప్రారంభిస్తామని నగర మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. గురువారం ఆయన మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్తో కలిసి నగరంలో నిర్మిస్తున్న తాత్కాలిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఆడిటోరియం అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్రావు మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కోసం ప్రత్యేకంగా భవనం నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ నాగమల్లేశ్వర్రావు, ఈఈలు కిష్టప్ప, మహేందర్, డీఈ మసూద్ అలీ, టీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల అశోక్ పాల్గొన్నారు.