గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి
ABN , First Publish Date - 2021-03-06T06:40:37+05:30 IST
గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి
ఉంగుటూరు, మార్చి 5 : గ్రామీణ మహిళలకు వివిధ చేతి వృత్తులలో ఉచిత శిక్షణతోపాటు, స్వయం ఉపాధి కల్పనకు తోడ్పాటు నందించి, వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నామని యూనియన్ బ్యాంక్ డీజీఎం వేగే రమేష్ అన్నారు.
ఆత్కూరు స్వర్ణభారత్ట్రస్ట్లో యూనియన్బ్యాంక్ ఆఫ్ ఇండియా, జీఎంఆర్ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహింస్తున్న స్వశక్తి గ్రామీణ ఉపాధి శిక్షణా కేంద్రంలో టైలరింగ్లో నెలరోజుల శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న సుమారు 30మంది యువతులకు శుక్రవారం ఆయన ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రతి మహిళ తమకు ఆసక్తివున్న చేతిపనులలో ప్రావీణ్యం సాధించి సరైన ఉపాధి మార్గాన్ని ఎంచుకుని స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించారు. శిక్షణా కేంద్రం డైరెక్టర్ లక్ష్మీతులసి మాట్లాడుతూ త్వరలో మరో బ్యాచ్ మహిళలకు కుట్టుపని, యువకులకు సెల్పోన్ రిపేరింగ్, పోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కంప్యూటర్ హార్డ్వేర్, కార్డ్రైవింగ్లో శిక్షణను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు 9032487697, 9963784411 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.