రష్యా దాడుల్లో మిలటరీ శిక్షణా కేంద్రం ధ్వంసం.. 9 మంది మృతి

ABN , First Publish Date - 2022-03-13T21:20:31+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా గగనతల దాడులు ఆదివారం మరింత తీవ్ర చేసింది. పశ్చిమ ఉక్రెయిన్‌‌లోని సైనిక శిక్షణా కేంద్రంపై జరిపిన దాడిలో..

రష్యా దాడుల్లో మిలటరీ శిక్షణా కేంద్రం ధ్వంసం.. 9 మంది మృతి

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా గగనతల దాడులు ఆదివారం మరింత తీవ్ర చేసింది. పశ్చిమ ఉక్రెయిన్‌‌లోని సైనిక శిక్షణా కేంద్రంపై జరిపిన దాడిలో కనీసం 9 మంది మృతి చెందగా, 57 మంది వరకూ గాయపడినట్టు స్థానిక అధికారులను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. పోలాండ్‌తో సరిహద్దుకు సమీపంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఈ విషయాన్ని లివివ్ రీజియన్ గవర్నర్ కోజిట్‌స్కీ ధ్రువీకరించారు. యవోరివ్ మిలటరీ రేంజ్‌పై రష్యా బలగాలు 30కి పైగా క్రూయిజ్ క్షిపణలతో దాడి జరిపినట్టు ఆయన చెప్పారు. ఈ మిలటరీ రేంజ్ లివివ్ సిటీకి వాయవ్యంగా 30 కిలోమీటర్ల దూరంలో, పోలాండ్‌తో ఉక్రెయిన్ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నట్టు తెలిపారు. ఈ శిక్షణా కేంద్రంలో అంతర్జాతీయ నాటో డ్రిల్స్‌ కూడా గతంలో జరిగాయి.

Updated Date - 2022-03-13T21:20:31+05:30 IST