తుప్పు పడుతున్న ప్రభుత్వ వాహనాలు
ABN , First Publish Date - 2022-06-23T06:25:54+05:30 IST
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద వివిధ కార్యాలయాల ప్రాంగణాల్లో పని చేయని ప్రభుత్వ వాహనాలు తుప్పుపడుతున్నాయి.
కర్నూలు(అగ్రికల్చర్),
జూన్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద వివిధ కార్యాలయాల
ప్రాంగణాల్లో పని చేయని ప్రభుత్వ వాహనాలు తుప్పుపడుతున్నాయి. వాటిల్లో
పాములు, పురుగులు చేరుతున్నాయి. దీంతో ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులు,
సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. కలెక్టరేట్ ప్రధాన గేటు పక్కనే ఉన్న
వ్యవసాయశాఖ జేడీఏ కార్యాలయం సమీపంలో మూడు వాహనాలను సంవత్సరాల తరబడి అక్కడే
ఉంచారు. ఈ వాహనాలు ఎండకు, వానకు తుప్పు పట్టిపోతున్నాయి. విషసర్పాలు ఆ
వాహనాల్లో చేరి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండటంతో ఉద్యోగులు భయాందోళనలకు
గురవుతున్నారు. అధికారులు స్పందించి వీటిని తమ కార్యాలయాల ప్రాంగణం నుంచి
తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.