రైలు పట్టాలపై మృతదేహం

ABN , First Publish Date - 2022-05-22T03:06:56+05:30 IST

బిట్రగుంట సెక్షన్‌ పరిధిలోని పడుగుపాడు రైల్వేస్టేషన్‌కు దక్షిణాన 178 కిలోమీటర్ల వద్ద దిగువ లైనులో శనివారం గుర్తు తెలియ

రైలు పట్టాలపై మృతదేహం
రైలు పట్టాలపై పడి ఉన్న మృతదేహం

బిట్రగుంట, మే 21: బిట్రగుంట సెక్షన్‌ పరిధిలోని పడుగుపాడు రైల్వేస్టేషన్‌కు దక్షిణాన 178 కిలోమీటర్ల వద్ద  దిగువ లైనులో శనివారం గుర్తు తెలియని వ్యక్తి(40)  మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్పీ ఎస్సై అరుణకుమారి  తెలిపారు.  మెరూన్‌ రంగు గళ్ల చేతుల  చొక్కా, బ్లూరంగు లుంగీ,  చొక్కాలోపల ఎర్ర టీషర్టు ధరించి ఉన్నాడని ఆమె తెలిపారు.  మృతదేహాన్ని బట్టి చూస్తే ఆత్మహత్య అయి ఉండవచ్చని పేర్కొన్నారు. మృతదేహాన్ని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-05-22T03:06:56+05:30 IST