సబర్బన్‌ రైళ్లలో ఏసీ బోగీలు: మంత్రి

ABN , First Publish Date - 2022-05-08T15:55:01+05:30 IST

సబర్బన్‌ రైళ్లలో ఏసీ బోగీల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై దక్షిణ రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ తెలిపారు. శాసనసభ

సబర్బన్‌ రైళ్లలో ఏసీ బోగీలు: మంత్రి

పెరంబూర్‌(చెన్నై): సబర్బన్‌ రైళ్లలో ఏసీ బోగీల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై దక్షిణ రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ తెలిపారు. శాసనసభ సమావేశాల్లో శనివారం మంత్రి పలు ప్రకటనలు చేశారు. ప్రభుత్వ పోటీపరీక్షలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనేలా వెబ్‌సైట్‌ పరిచయం చేయనున్నామన్నారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా పరీక్షల నోటిఫికేషన్‌, ఫలితాలను అభ్యర్థులు తెలుసుకొనేందుకు వీలవుతుందని అన్నారు. కొత్త పింఛన్‌ విధానం స్థానే పాత పింఛన్‌ విధానం అమలుకు పలు సమస్యలున్నాయని, వాటిపై నిపుణులతో చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు.


Read more