సచివాలయాలను తనిఖీ చేసిన జేసీలు
ABN , First Publish Date - 2022-01-25T02:47:45+05:30 IST
మండలంలోని పలు సచివాలయాలను సోమవారం ఇద్దరు జేసీలు తనిఖీ చేశారు. రెవెన్యూ జేసీ హరీంద్రప్రసాద్ పిడతాపోలూరు
ముత్తుకూరు, జనవరి24: మండలంలోని పలు సచివాలయాలను సోమవారం ఇద్దరు జేసీలు తనిఖీ చేశారు. రెవెన్యూ జేసీ హరీంద్రప్రసాద్ పిడతాపోలూరు, ముసునూరువారిపాళెం, నేలటూరు సచివాలయాలను తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రత్యేకాధికారి, ఆసరా జేసీ రోజ్మాండ్ దొరువులపాళెం, ముత్తుకూరు-2 సచివాలయాల్లో పర్యటిం చి, పక్కాఇళ్ల నిర్మాణం, ఓటీఎస్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధికారులు, సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ గ్రామాల్లో పక్కాఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వం పత్రిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఓటీఎస్ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా ఓటీఎస్ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రత్యూష, తహసీల్దారు సోమ్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.