పాఠశాలల స్థలాల్లో సచివాలయ భవనాలు

ABN , First Publish Date - 2022-06-27T06:56:26+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లోనే సచివాలయ భవనాల నిర్మాణం చేపట్టారు. సచివాలయ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే పలుచోట్ల కార్యాలయాలను ఏర్పాటుచేశారు. హైకోర్టు ఆదేశాలతో వాటిని ఖాళీ చేయించి వేరే భవనాల్లోకి మార్పు చేశారు. అయితే కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో 13 భవనాల నిర్మాణం చేపట్టారు.

పాఠశాలల స్థలాల్లో సచివాలయ భవనాలు
ఇందుపల్లి భట్లపాలెంలో ప్రభుత్వ పాఠశాల స్థలంలో నిర్మిస్తూ నిలిచిన సచివాలయ భవనం

  • కోర్టు ఆదేశాలతో జిల్లాలో నిలిచిన తొమ్మిది భవనాల నిర్మాణం

అమలాపురం రూరల్‌, జూన 26: ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లోనే సచివాలయ భవనాల నిర్మాణం చేపట్టారు. సచివాలయ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు  ప్రభుత్వ పాఠశాలల్లోనే పలుచోట్ల కార్యాలయాలను ఏర్పాటుచేశారు. హైకోర్టు ఆదేశాలతో వాటిని ఖాళీ చేయించి వేరే భవనాల్లోకి మార్పు చేశారు. అయితే కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో 13 భవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్క అమలాపురం రూరల్‌ మండలంలోనే మూడు సచివాలయ భవనాల పనులను ఇదే తరహాలో ప్రారంభించగా అవన్నీ కోర్టు ఆదేశాలతో వివిధ దశల్లో నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లుల రాక ఏళ్లు గడిచిపోతుండడంతో కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారు. అమలాపురం రూరల్‌ మండల పరిధిలోని బండారులంక వల్లూరువారిపేట, ఇందుపల్లి భట్లపాలెం, గున్నేపల్లి అగ్రహారం ప్రాథమిక పాఠశాలల స్థలాల్లోనే సచివాలయాల నిర్మాణాలు చేపట్టగా కోర్టు ఆదేశాలతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీటికి విముక్తి ఎప్పుడు కలుగుతుందో చెప్పలేని పరిస్థితి.




Updated Date - 2022-06-27T06:56:26+05:30 IST