పిఠాపురంలో సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్
ABN , First Publish Date - 2022-01-22T05:28:28+05:30 IST
పిఠాపురం పట్టణంలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పిఠాపురం, జనవరి 21: పిఠాపురం పట్టణంలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని వార్డు సచివాలయం-2లో వెల్ఫేర్ కార్యదర్శిగా పనిచేస్తున్న బి.శిరీషరాణి విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కాపు నేస్తం దరఖాస్తులు ఆన్లైన్ చేయకపోవడంతో పలువురు అర్హులకు సాయం అందని నేపథ్యంలో ఆమె పనితీరుపై పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై మునిసిపల్ కమిషనర్ ఎం.రామ్మోహన్ పుర పరిపాలనాశాఖ ఆర్డీకి నివేదిక పంపారు. దీనిపై ఆర్డీ వివరణ కోరినప్పటికీ స్పందించకపోవడం, అనుమతి లేకుండా సెలవు పెట్టడాన్ని తీవ్రంగా స్పందించారు. దీంతో వెల్ఫేర్ కార్యదర్శి శిరీషరాణిని విధులు నుంచి సస్పెండ్ చేస్తూ ఆర్డీ ఎన్వీవీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.