సచివాలయాల కార్యకలాపాలు వీఆర్వోలకు అప్పగించాలి
ABN , First Publish Date - 2021-05-11T04:41:56+05:30 IST
జీవో నెం 2 ప్రకారం సచివాలయాల కార్యకలాపాలను డీడీవోలుగా ఉన్న వీఆర్వోలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు.
పి.గన్నవరం,
మే 10: జీవో నెం 2 ప్రకారం సచివాలయాల కార్యకలాపాలను డీడీవోలుగా ఉన్న
వీఆర్వోలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్
చేశారు. ఇన్చార్జ్ ఎంపీడీవో ఎం.ప్రభాకరరావుకు వినతిప్రతం అందించారు.
వలంటీర్లు వీఆర్వోలు కింద పనిచేసేలా చర్యలు చేపట్టలన్నారు. పంచాయతీలకు
సంబంధించిన పనులను మాత్రమే కార్యదర్శులతో చేయించాలన్నారు. కార్యక్రమంలో
మండల కార్యదర్శుల సంఘ అధ్యక్షుడు ఎంహెచ్ రహమాన్, జివివికె కుమార్,
పివివి సత్యనారాయణ, ఎంకే అబ్బాస్, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.