సచివాలయాలు, ఆర్‌బీకేల పనితీరు బాగుంది

ABN , First Publish Date - 2022-07-06T05:52:40+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పనితీరు సంతృప్తికరంగా ఉందని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు సంతోష్‌ మెహరా తెలిపారు.

సచివాలయాలు, ఆర్‌బీకేల పనితీరు బాగుంది
నంబూరు ఆర్‌బికె వద్ద ట్రాక్టర్‌ నడుపుతున్న జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యులు సంతోష్‌ మెహరా, జేసీ రాజకుమారి తదితరులు

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు సంతోష్‌ మెహరా

పెదకాకాని, జూలై 5: ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పనితీరు సంతృప్తికరంగా ఉందని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు సంతోష్‌ మెహరా తెలిపారు. మంగళవారం పెదకాకానిలోని సచివాలయాన్ని, నంబూరులో ఆర్‌బీకేను సందర్శించారు. తొలుత సచివాలయాన్ని సందర్శించిన అక్కడి సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్బీకేలో కొంతసేపు సిబ్బందితో ముచ్చటించారు. కార్యక్రమంలో ఏపీ మానవ హక్కుల కమిషన్‌ సభ్యులు శ్రీనివాసరావు, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి, గుంటూరు ఆర్డీవో ప్రభాకరరెడ్డి, ఎంపీపీ తులిమిల్లి శ్రీనివాసరావు, ఎంపీడీవో పీవీ విజయలక్ష్మి, సర్పంచ్‌ గోళ్ళ స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T05:52:40+05:30 IST