కఠారి హేమలతకు బలిజల సంఘీభావం

ABN , First Publish Date - 2022-06-28T05:02:27+05:30 IST

చిత్తూరు మాజీ మే యర్‌ కఠారి హేమలత పట్ల పోలీసులు ప్రద ర్శించిన తీరును ఖండిం చడమే కాకుండా బాధి తురాలికి మద్దతు ప్రక టిస్తున్నట్లు మదనపల్లె బలిజ సంఘం నేతలు పేర్కొన్నారు.

కఠారి హేమలతకు బలిజల సంఘీభావం
మాట్లాడుతున్న బలిజ సంఘం నాయకులు

మదనపల్లె టౌన్‌, జూన్‌ 27: చిత్తూరు మాజీ మే యర్‌ కఠారి హేమలత పట్ల పోలీసులు ప్రద ర్శించిన తీరును ఖండిం చడమే కాకుండా బాధి తురాలికి మద్దతు ప్రక టిస్తున్నట్లు మదనపల్లె బలిజ సంఘం నేతలు పేర్కొన్నారు.  సోమవారం స్థానిక టీడీపీ కార్యాల య ఆవరణలో రామాచర్లపల్లెకు చెందిన బలిజ సంఘం నాయకులు బి.వెంకటరమణ మాట్లాడుతూ కఠారి మోహన్‌, అనూరాధల హత్య అనంతరం చిత్తూరులో టీడీపీకి హేమలత కుటుంబం ఎంతో శ్రమిస్తోం దన్నారు.  ఆమెను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించడమే కాక, అడ్డుకోబోయిన హేమలతపై జీపును తోలి గాయపడేలా చేశారన్నారు. దీనికి కారణమైన సీఐను సస్పెండ్‌ చేయా లని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కత్తి లక్ష్మన్న, సీటీఎం వేమన్న, నటశేఖర్‌, ఎస్‌.వెంకటరమణ, డేగన్న, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-28T05:02:27+05:30 IST