నా ప్రేమతో నువ్వు మారతావనుకున్నా.. ఇంకెవర్నీ మోసం చేయకు.. అంటూ భార్యకు లేఖ రాసి..

ABN , First Publish Date - 2022-04-21T18:33:24+05:30 IST

ఆ వ్యక్తి తన భార్యను ఎంతగానో ప్రేమించాడు.. ఆమెతో కలిసి సంతోషంగా జీవించాలనుకున్నాడు..

నా ప్రేమతో నువ్వు మారతావనుకున్నా.. ఇంకెవర్నీ మోసం చేయకు.. అంటూ భార్యకు లేఖ రాసి..

ఆ వ్యక్తి తన భార్యను ఎంతగానో ప్రేమించాడు.. ఆమెతో కలిసి సంతోషంగా జీవించాలనుకున్నాడు.. అయితే ఆమె తన భర్తను మోసం చేసింది.. వేరే యువకుడితో ప్రేమాయణం సాగించింది.. భర్తకు దూరమై పుట్టింట్లోనే ఉండిపోయింది.. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన భర్తను తిరస్కరించింది.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. చనిపోయే ముందు అతను రాసిన లేఖ కుటుంబ సభ్యులను కంటతడి పెట్టిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఆ వ్యక్తి పేరు ఆకాష్.


`డియార్ జానూ.. నీ కోసమే, నిన్ను తీసుకెళ్లేందుకే గ్వాలియర్ వచ్చాను. నీకు సంజయ్‌ అంటే ఇష్టమని నాకు చాలా రోజుల క్రితమే తెలుసు. కానీ, నా ప్రేమ నిన్ను మార్చేస్తుందేమో అనుకున్నాను. కానీ, నువ్వు నాకు దూరమయ్యావు. మీ అమ్మ, చెల్లి మాటలు విని నాతో రావడానికి నిరాకరించావు. నీ కోసం ఎంత ఏడ్చానో ఒక్కసారి నా కళ్లను చూస్తే తెలిసేది. ఎవరు ఎన్ని మాటలన్నా నేను పట్టించుకోలేదు. కానీ, నువ్వు నా ప్రేమను తిరస్కరించడాన్ని భరించలేకపోతున్నా.


ఇంకెవర్నీ ఇలా మోసం చేయకు. నువ్వు తప్ప నా జీవితంలో ఎవ్వరూ లేరు. నేను నిన్ను మాత్రమే ప్రేమించాను. చనిపోతున్న ఈ సమయంలో కూడా నువ్వు నా హృదయంలో ఉన్నావు. నిన్ను వేరే వ్యక్తి పక్కన చూడలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నీ కోసం వందసార్లైనా చచ్చిపోతాను. నా ఆత్మహత్యతో ఎవరికీ సంబంధం లేదు. అమ్మా నన్ను క్షమించు` అంటూ ఆకాష్ ఆ లేఖ రాశాడు. 

Updated Date - 2022-04-21T18:33:24+05:30 IST