భద్రంగా బ్యాలెట్ బాక్సులు
ABN , First Publish Date - 2021-05-11T04:24:01+05:30 IST
తాళ్లపాలెం గురుకులంలో బ్యాలెట్ బాక్సులు భద్రంగానే ఉన్నాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ సౌజన్య చెప్పారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి సౌజన్య
కశింకోట, మే 10: తాళ్లపాలెం గురుకులంలో బ్యాలెట్ బాక్సులు భద్రంగానే ఉన్నాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ సౌజన్య చెప్పారు. ఈ బాక్సులను సహాయ ఎన్నికల అధికారి కె.హరిప్రసాద్, హెచ్డీటీ శేషు, ఈవోపీఆర్డీ కె.ధర్మారావు, ఎస్ఐ ఎల్.సురేశ్కుమార్ సమక్షంలో సోమవారం పరిశీలించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అనంతరం 66 బ్యాలెట్ బాక్సులను ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఉంచామని, గది బయట చెదలు పట్టి ఉండడంతో మందు కొట్టించామని ఆమె చెప్పారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ తలుపులు మూసివేశారు. వీరి వెంట పోటీలో ఉన్న అభ్యర్థులు ఉన్నారు.