రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: అంజద్బాషా
ABN , First Publish Date - 2020-11-30T05:02:57+05:30 IST
ప్రకృతి విపత్తులతో ఎలాంటి నష్టం కలగకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా పేర్కొన్నారు.
కడప(ఎర్రముక్కపల్లె), నవంబరు 29: ప్రకృతి విపత్తులతో ఎలాంటి నష్టం కలగకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా పేర్కొన్నారు. కడప విమానాశ్రయం సమీపంలో ఆదివారం నూతనంగా నిర్మించిన ఆస్తానే నూరియా మజిద్కు అనుబంధంగా ఏర్పాటు చేసిన మదరసాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల ప్రభావం త్వరగా తగ్గి ప్రశాంత జనజీవన వాతావరణం నెలకొనాలని భగవంతున్ని కోరుతున్నానన్నారు. మజిద్లు శాంతికి నిలయాలని, మనుషుల్లో మానవీయ విలువలను పెంచే పవిత్ర ప్రాంగణాలన్నారు. ముందుగా ఉపముఖ్యమంత్రి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సయ్యద్ వలీవుల్లా హుసేనీ, మహ్మద్ బాగ్దాది, కాంగ్రెస్ నాయకులు నజీర్ అహ్మద్, ఉలేమా కమిటీ సభ్యులు, మత గురువులు పాల్గొన్నారు.