నేటి నుంచి ఎలిమినేడులో సహస్ర చండీయాగం

ABN , First Publish Date - 2022-08-18T05:34:23+05:30 IST

నేటి నుంచి ఎలిమినేడులో సహస్ర చండీయాగం

నేటి నుంచి ఎలిమినేడులో సహస్ర చండీయాగం
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రశాంత్‌కుమార్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 17: ఎలిమినేడులోని వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు సహస్ర చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. ప్రముఖ పుణ్య క్షేత్రాల రుత్విక్కులు ఈ యాగంలో పాల్గొననున్నారు. హోమగుండాలు, ఇతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి(బంటి) యాగానికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఐదు రోజులపాటు ఉదయం వేళల్లో హోమాలు సాయంత్రం దేవతా మూర్తుల కల్యాణం ఉంటుందని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు. 18న శివపార్వతుల కల్యాణం, 19న లక్ష్మీనరసింహస్వామి కల్యాణం, 20న పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం, 21న సీతారాముల కల్యాణం, 22న ఉదయం హోమం, మధ్యాహ్నం పూర్ణాహుతి ఉంటాయన్నారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలు ఈ యాగంలో పాల్గొనాలని ఆయన కోరారు.

Updated Date - 2022-08-18T05:34:23+05:30 IST