
హైదరాబాద్: కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్లో తెలిపారు. ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి మద్యం తాగలేదన్నారు. రోడ్డుపై ఇసుక ( మట్టి ) ఉండడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారని ట్విట్టర్లో చిరంజీవి పేర్కొన్నారు.