హీరోయిన్ సాయిపల్లవి పై పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-06-16T23:39:02+05:30 IST

ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ సాయిపల్లవిపై భజరంగ్‌దళ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

హీరోయిన్ సాయిపల్లవి పై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్‌: ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ సాయిపల్లవిపై భజరంగ్‌దళ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.ఓ యూట్యూబ్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని భజరంగ్ దళ్ నేతలు సుల్తాన్‌బజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.సాయిపల్లవి వ్యాఖ్యలపై వీడియో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు తెలిపారు.

వివాదానికి కారణమేమంటే....

సాయిపల్లవి ఇటీవల ఒక యూట్యూబ్ చానెల్ ఇంటర్వూలో మాట్లాడుతూ... ‘‘కొన్ని రోజుల ముందు ఈ కశ్మీరీ ఫైల్స్ వచ్చింది కద.. సో.. కశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు వాళ్లు చూపించారు ఎట్లా చంపారు. ఆ టైంలో అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్‌ను ఎట్లా చంపారనేది చూపించారు కద. కోవిడ్ టైంలో ఎవరో ‘If You Taking A Religious Conflict’ లాగా తీసుకుంటే రీసెంట్‌గా ఎవరో ఒక బండిలో Cowని తీసుకెళుతున్నారు. ఆ బండి డ్రైవ్ చేసేవాళ్లు ముస్లింగా ఉన్నారు. కొన్ని జనాలు కొట్టి ‘జై శ్రీరాం.. జై శ్రీరాం’ అని చెప్పారా. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికీ Difference ఎక్కడ ఉంది..? సో ఇప్పుడు మనం Religious పేరులో మనం మంచిగా ఉండాలి. మనం మంచి పర్సన్‌గా ఉండి ఉంటే హర్ట్ చేయం. ఒక పర్సన్ పైన ఆ ప్రెజర్ పెట్టం’’ అని చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి.

Updated Date - 2022-06-16T23:39:02+05:30 IST