సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు!
ABN , First Publish Date - 2022-06-19T01:11:32+05:30 IST
న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్.. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనుంది.
న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్.. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఎడిసన్ టౌన్షిప్లోగల శ్రీ శివ విష్ణు దేవాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎడిసన్ మేయర్ శామ్ జోషి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో భాగంగా సాయిదత్తా పీఠం గురుకుల యోగా ఇన్స్ట్రక్టర్ డా. విజయ నిమ్మ ఆధ్వర్యంలో యోగా సెషన్లు జరగనున్నాయి. అంతేకాకుండా.. డయాబెటిస్ నియంత్రణలో యోగా పాత్ర గురించి Kehinde Ibitola, MSN, APRN ప్రసంగిస్తారు. ఫిజికల్ థెరపీలో యోగా ప్రాముఖ్యత గురించి గరిమా జెయిన్, ఆయుర్వేదంతో జీవన సమతౌల్యం సాధించడం ఎలా అన్న అంశాన్ని యోగాకౌన్సెలర్ Jhankhna varma వివరిస్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని స్థానికులను ఆహ్వానిస్తూ సాయిదత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది.