ప్రజావ్యతిరేక విధానాలతో వైసీపీ పాలన: శైలజానాథ్‌

ABN , First Publish Date - 2022-04-24T18:10:49+05:30 IST

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ప్రజావ్యతిరేక విధానాలతో వైసీపీ పాలన: శైలజానాథ్‌

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధనాలతో పాలన చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి అసమర్ధత రాష్టాన్ని ఆధోగతిపాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీల హక్కలకు రక్షణ లేకుండ పోయిందన్నారు. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా, అత్యాచారం జరిగినా.. బాధితులకు ధరకట్టే విధానాన్ని సీఎం జగన్‌ అవలంభిస్తున్నారని శైలజానాథ్‌ విమర్శించారు.

Updated Date - 2022-04-24T18:10:49+05:30 IST