గౌతమ్రెడ్డి మరణం జీర్ణించుకోలేనిది: సజ్జల
ABN , First Publish Date - 2022-02-21T21:36:37+05:30 IST
గౌతమ్రెడ్డి మరణం జీర్ణించుకోలేనిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
హైదరాబాద్: ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మరణం జీర్ణించుకోలేనిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్లోని గౌతమ్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రభుత్వానికి గౌరవం తెచ్చారన్నారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. గౌతమ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సజ్జల తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. మంగళవారం ఉదయం నెల్లూరుకు గౌతమ్రెడ్డి భౌతికకాయాన్ని తరలిస్తామని, బుధవారం స్వగ్రామంలో గౌతమ్రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.