సజ్జల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది: అయ్యన్న

ABN , First Publish Date - 2022-01-04T02:05:55+05:30 IST

వైసీపీ పాలనలో రామరాజ్యం అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

సజ్జల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది: అయ్యన్న

విశాఖ: వైసీపీ పాలనలో రామరాజ్యం అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సజ్జల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని తప్పుబట్టారు. రాష్ట్రంలోని ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా కాజేస్తున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. పోలవరం, అమరావతి, రైల్వేజోన్ ఏమైందో చెప్పాలి? అని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకొచ్చారని, ఢిల్లీ వెళ్లి ప్రధాని కాళ్లు పట్టుకోవడం తప్పితే ఏం సాధించారని నిలదీశారు. సినిమా టికెట్‌ రేట్లు తగ్గించినవారు, సిమెంట్‌ రేట్లు తగ్గించొచ్చు కదా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

Updated Date - 2022-01-04T02:05:55+05:30 IST