వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన సజ్జల
ABN , First Publish Date - 2022-10-02T09:32:17+05:30 IST
2014కు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారని, వైఎస్ కుటుంబంలో ఉడుములా చేరి తల్లీ కొడుకును, అన్నా చెల్లిని విడదీసి.
- వారి కుటుంబంలో ఉడుములా చేరి..
- తల్లీ కొడుకును, అన్నా చెల్లిని విడదీశారు: గంగుల
కరీంనగర్ టౌన్/హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): 2014కు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారని, వైఎస్ కుటుంబంలో ఉడుములా చేరి తల్లీ కొడుకును, అన్నా చెల్లిని విడదీసి.. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తెలంగాణలోనూ వైఎస్ కుటుంబంలో మాదిరిగా కేసీఆర్ కుటుంబాన్ని విడదీయడం కుదరదని హెచ్చరించారు. అమరావతి నుంచి హైదరాబాద్కు వలసలు వస్తున్నారని, ఎవరిపాలన బాగుందో ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన వాళ్లను అడిగితే చెబుతారన్నారు. సజ్జల ఏపీ ప్రభుత్వానికి సలహాదారుడని, ఆయన వాళ్లకు 3,4 రాజధానుల కోసం సలహాలిచ్చుకోవచ్చు కానీ తెలంగాణలో తలదూర్చితే బాగుండదన్నారు.
తెలంగాణ అంటేనే బహుజనుల గడ్డ, బహుజనుల బంధు కేసీఆర్ అని, మా వ్యవహారాల్లో తలదూరిస్తే వదిలేది లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావును విమర్శిస్తూ ఏపీ మంత్రులు అమర్నాథ్రెడ్డి, బొత్సతోపాటు సజ్జల చేసిన వాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఏపీలోని వైసీపీ.. బీజేపీ బీ టీం అని, విమర్శించారు. ఏపీలో జగన్ జగన్ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ పచ్చని సంసారంలో చిచ్చుపెట్టేందుకు వైసీసీపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. మంత్రి హరీశ్ రావుపై ఏపీ మంత్రులు, అక్కడి రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని టీఎన్జీవోఏ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.