చంద్రబాబుకు సజ్జల కౌంటర్

ABN , First Publish Date - 2021-06-17T20:14:34+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు లేఖలో అన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు.

చంద్రబాబుకు సజ్జల కౌంటర్

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు లేఖలో అన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. ప్రభుత్వంపై ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారని, టీడీపీ హయాంలోని బకాయిలను వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. సీఎం జగన్ పాలనలో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 


ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. మద్దతుధరకు కొనుగోలు చేయడంలోనూ  ప్రభుత్వం విఫలమైందని లేఖలో తప్పుబట్టారు. రైతు ప్రభుత్వం అని చెప్పి.. వారిని నిండా ముంచే విధానాలు అవలంభిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతల్లో నగదు జమచేశామని గుర్తుచేశారు.

Updated Date - 2021-06-17T20:14:34+05:30 IST