సజ్జనార్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , First Publish Date - 2021-12-23T01:59:20+05:30 IST
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తమ గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు
చౌటుప్పల్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తమ గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం, కుంట్లగూడెం, నేలపట్ల, గోకారం గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ఇటీవల హైదరాబాద్లో సజ్జనార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రయాణానికి ఇబ్బంది పడుతున్నామని, ప్రైవేటు వాహనాల్లో వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని వివరించారు. దీంతో స్పందించిన ఆర్టీసీ ఎండీ నల్లగొండ జిల్లా నార్కట్పల్లి డిపో బస్సును గోకారం నుంచి నేలపట్ల, కుంట్లగూడెం, చౌటుప్పల్ మీదుగా దిల్సుఖ్నగర్కు బయలుదేరే విధంగా ఆదేశాలు జారీచేశారు. సజ్జనార్ ఆదేశాల మేరకు బుధవారం నేలపట్ల గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడంతో ప్రజలు, విద్యార్థులు ఆనందం వ్యక్తంచేశారు. నేలపట్లకు వచ్చిన బస్సుకు మామిడి తోరణాలు కట్టి, పూజలు చేసి స్వాగతం పలికారు.