ఐదేళ్లలో తొలిసారి..

ABN , First Publish Date - 2022-06-04T10:09:53+05:30 IST

2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ ఆ తర్వాత అనూహ్యంగా ఫామ్‌ కోల్పోయింది.

ఐదేళ్లలో తొలిసారి..

సాక్షి మాలిక్‌కు స్వర్ణం

అల్మాటీ: 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ ఆ తర్వాత అనూహ్యంగా ఫామ్‌ కోల్పోయింది. ఎన్నో ఏళ్లుగా మేజర్‌ విజయం కోసం ఎదురుచూస్తున్న ఈ హరియాణా స్టార్‌.. మళ్లీ ఇన్నాళ్లకు అంతర్జాతీయ వేదికపై స్వర్ణ పతకంతో మెరిసింది. యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో సాక్షి 62 కిలోల విభాగం ఫైనల్లో 7-4తో స్థానిక స్టార్‌ ఇరీనా కుజ్నెత్సోవాను చిత్తుచేసి విజేతగా నిలిచింది. సాక్షి చివరిగా 2017 కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది. 

Updated Date - 2022-06-04T10:09:53+05:30 IST