సాయంత్రానికి అందరికీ జీతాలు: మంత్రుల కమిటీ

ABN , First Publish Date - 2022-02-01T20:58:24+05:30 IST

సాయంత్రానికి అందరికీ జీతాలు వేస్తున్నామని మంత్రుల కమిటీ

సాయంత్రానికి అందరికీ జీతాలు: మంత్రుల కమిటీ

అమరావతి: సాయంత్రానికి అందరికీ జీతాలు వేస్తున్నామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. పీఆర్సీపై ఏపీ మంత్రుల కమిటీతో  ఉద్యోగసంఘాల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మంత్రుల కమిటీ ఎదుట మూడు ప్రతిపాదనలను స్టీరింగ్ కమిటీ ఉంచింది. చర్చించి మళ్లీ చెబుతామని మంత్రుల కమిటీ పేర్కొంది. సచివాలయంలో అందుబాటులో ఉండాలని స్టీరింగ్ కమిటీకి సూచించింది. అశుతోష్ మిశ్రా రిపోర్ట్ బయటపెట్టాలని స్టీరింగ్ కమిటీ కోరింది. పీఆర్సీ జీవోల రద్దు, పాత జీతాలు వేయాలని స్టీరింగ్‌ కమిటీ ప్రతిపాదనలు చేసింది. చలో విజయవాడ కార్యక్రమం వాయిదా వేసుకోవాలని మంత్రులు కోరారు. సమస్యల పరిష్కారం తర్వాతే తమ కార్యాచరణపై చర్చిస్తామని స్టీరింగ్‌ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. జీతాల విషయంలో తొందర ఎందుకని స్టీరింగ్ కమిటీ ప్రశ్నించింది. సాయంత్రానికి అందరికీ జీతాలు వేస్తున్నామని మంత్రుల కమిటీ పేర్కొంది. 

Updated Date - 2022-02-01T20:58:24+05:30 IST