twitter CEO పరాగ్ జీతం ఎంతో తెలుసా?
ABN , First Publish Date - 2021-12-01T03:20:29+05:30 IST
ఇలా వెతుకున్న క్రమంలో నెటిజెన్లను పరాగ్ జీతం ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని నెటిజెన్లే తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. జాక్ డోర్సే వైదొలగిన అనంతరం ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు..
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవోగా ఎన్నికైన పరాగ్పై నిన్నటి నుంచి అభినందనల వెల్లువ కురుస్తూనే ఉంది. అయితే పరాగ్పై విమర్శలు కూడా రాకపోలేదు. గతంలో ఆయన చేసిన కొన్ని ట్వీట్లను తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే భారతీయుడైన పరాగ్పై స్వదేశం నుంచి అభినందనలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంతే కాకుండా పరాగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నెటిజెన్లు గూగుల్ని ఆశ్రయిస్తున్నారు. పరాగ్ చదువు, వయసు, జీతం, ఇతర వివరాలను గూగుల్లో వెతుకుతున్నారు.
ఇలా వెతుకున్న క్రమంలో నెటిజెన్లను పరాగ్ జీతం ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని నెటిజెన్లే తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. జాక్ డోర్సే వైదొలగిన అనంతరం ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు తీసుకున్న పరాగ్ అగర్వాల్ ఏడాది జీతం అక్షరాల ఒక మిలియన్ డాలర్లట. అంటే ఇండియన్ కరెన్సీలో 7.5 కోట్ల రూపాయలన్నమాట. వీటితో పాటు ఆయనకు నియంత్రిత స్టాక్ యూనిట్ల నుంచి 12.5 మిలయిన్ డాలర్లు పొందనున్నారు. ఇక వీటితో పాటు బోనస్లు, ఇతర ప్రయోజనాలు ఎలాగూ ఉండనే ఉంటాయి.