జీతాలిప్పించండి సారూ..!

ABN , First Publish Date - 2021-01-17T06:37:51+05:30 IST

కంభం ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న తమకు మూడు నెలలుగా జీతాలు లేవని కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న పారిశుధ్య సిబ్బంది ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎదుట వాపోయారు.

జీతాలిప్పించండి సారూ..!

కంభం, జనవరి 16 : కంభం ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న తమకు మూడు నెలలుగా జీతాలు లేవని కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న పారిశుధ్య సిబ్బంది ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎదుట వాపోయారు. శనివారం ఆయన వైద్యశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రం ప్రారంభానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన పారిశుధ్య సిబ్బంది తమకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతోపాటు సెలువులు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈవిషయాన్ని సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళితే ‘తాను కొత్తగా వచ్చాను, తనకేమి తెలియదంటున్నారని’ ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుంటే తమ కుటుంబాలు ఎలా గడవాలని వాపోయారు. కాంట్రాక్టర్‌, అధికారులతో మాట్లాడి తమ సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తాను సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరి స్తానన్నారు.

Updated Date - 2021-01-17T06:37:51+05:30 IST