రైతుబజార్లలో వంటనూనెల విక్రయం: సీఎస్ సమీర్‌శర్మ

ABN , First Publish Date - 2022-03-16T01:47:52+05:30 IST

రైతుబజార్లలో వంట నూనెలను విక్రయించాలని అధికారులను ప్రభుత్వ

రైతుబజార్లలో వంటనూనెల విక్రయం: సీఎస్ సమీర్‌శర్మ

అమరావతి: రైతుబజార్లలో వంట నూనెలను విక్రయించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదేశించారు. చౌకధరల దుకాణాలు, మొబైల్ వ్యాన్ల ద్వారా తక్కువ ధరకు వంట నూనెలను  అందించాలన్నారు. పరిమితికి నిల్వచేస్తే దాడులు చేసి స్వాధీనపర్చుకుని మార్కెట్లోకి విడుదల చేయాలన్నారు. అధిక ధరలు, అక్రమ నిల్వలపై 6-ఎ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రతిరోజు వంటనూనెల ధరలను సమీక్షించాలని ఆయన సూచించారు. 

Updated Date - 2022-03-16T01:47:52+05:30 IST