మద్యంలో నీళ్లు కలిపి విక్రయాలు

ABN , First Publish Date - 2021-11-29T05:08:06+05:30 IST

మద్యంలో నీళ్లు కలిపి అమ్మకాలు సాగిస్తున్న ఘటన ఒకటి ఆదివారం వెలుగు చూసింది.

మద్యంలో నీళ్లు కలిపి విక్రయాలు

  1.  వినియోగదారుల ఫిర్యాదుతో ఎక్సైజ్‌ దాడులు 
  2.   నలుగురు సిబ్బందిపై కేసు నమోదు


బండి ఆత్మకూరు, నవంబరు 28: మద్యంలో నీళ్లు కలిపి అమ్మకాలు సాగిస్తున్న ఘటన ఒకటి ఆదివారం వెలుగు చూసింది. నంద్యాల ఎక్సైజ్‌ సీఐ కృష్ణకుమార్‌ వివరాల మేరకు.. బండిఆత్మ కూరు ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కల్తీ చేసి విక్రయిస్తున్నట్లు నంద్యాల ఎక్సైజ్‌ సూపరిం టెండెంట్‌ నాగేశ్వరావుకు వినియోగ దారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎస్‌ఐలు వెంకటే శ్వర్లు, సందీప్‌, అస్లామ్‌లతోపాటు డీఎస్‌, ఈఎస్‌ స్క్వాడ్‌లతో తనిఖీ చేశారు. 8పీఎం 10 ఆఫ్‌ బాటిళ్లలో, 8పీఎం 4 క్వార్టర్‌ బాటిళ్లలో నీళ్లు కలిపి నట్లు అక్కడే నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైంది. దీంతో దుకాణంలో పని చేస్తున్న నలుగురు సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి వారిని తక్షణమే విధుల నుంచి తప్పించారు. 


Updated Date - 2021-11-29T05:08:06+05:30 IST