Infosys సీఈవోగా మరో 5 ఏళ్లపాటు సలీల్ పరేఖ్.. పునర్నియామకం..
ABN , First Publish Date - 2022-05-23T01:54:36+05:30 IST
దేశీయంగా రెండవ అతిపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ ఇన్ఫోసిస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లిమిటెడ్(సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా సలీల్ పరేఖ్ పునర్నియమితులయ్యారు.
బెంగళూరు : దేశీయంగా రెండవ అతిపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ అయిన ఇన్ఫోసిస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా సలీల్ పరేఖ్ పునర్నియమితులయ్యారు. మరో ఐదేళ్లపాటు అంటే మార్చి 2027 వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ఇన్ఫోసిస్ లిమిటెడ్ ప్రకటించింది. మే 21, 2022న జరిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ ఎన్ఆర్సీ(నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ) సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్లో ఇన్ఫోసిస్ లిమిటెడ్ వెల్లడించింది. కాగా సలీల్ పరేఖ్ జనవరి 2018 నుంచి ఇన్ఫోసిస్సీ ఈవో, ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన పునర్నియామకానికి సంబంధించి కంపెనీ షేర్ హోల్డర్ల ఆమోదం దక్కాల్సి ఉంది.