80 శాతం ఓట్లతో ముందంజలో అఖిలేష్ యాదవ్

ABN , First Publish Date - 2022-03-10T15:52:14+05:30 IST

తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నసమాజ్‌వాదీ పార్టీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అఖిలేష్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు పదివేల మెజారిటీ కలిగి ఉన్నారు.

80 శాతం ఓట్లతో ముందంజలో అఖిలేష్ యాదవ్

తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నసమాజ్‌వాదీ పార్టీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అఖిలేష్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు పదివేల మెజారిటీ కలిగి ఉన్నారు. రెండు రౌండ్లకుగాను అఖిలేష్‌కు 12,011 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ బగేల్‌కు 2,638 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తర్వాత బీఎస్పీ అభ్యర్థి 281 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో అఖిలేష్‌కు 80.09 శాతం ఓట్లురాగా, సమీప బీజేపీ అభ్యర్థికి 17.59 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అఖిలేష్‌కు భారీ మెజారిటీ రావడం ఖాయంగా కనిపిస్తోంది.



Updated Date - 2022-03-10T15:52:14+05:30 IST