విజయనగరంలో ప్రారంభమైన శంబర పోలమాంబ జాతర
ABN , First Publish Date - 2021-01-25T15:45:43+05:30 IST
విజయనగరం: శంబర పోలమాంబ జాతర సోమవారం ఉదయం వైభవంగా ప్రారంభమైంది.
విజయనగరం: శంబర పోలమాంబ జాతర సోమవారం ఉదయం వైభవంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ జాతరకు ప్రతీ ఏడాది లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇతర ప్రాంతాల వారిని అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యం దష్ట్యా ప్రజలెవరూ జాతరకు రావద్దని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి కోరారు. కరోనా ప్రభావం విజయనగరం జిల్లాలో తగ్గుతున్న తరుణంలో ఉత్సవ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటే మళ్లీ వైరస్ ప్రభావం పెరిగే అవకాశం ఉందన్నారు. కాగా పోలమాంబ జాతరకు 550 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.