ఉ.సాంబశివరావు మృతి బహుజన ఉద్యమాలకు తీరని లోటు : గద్దర్
ABN , First Publish Date - 2021-07-26T05:19:06+05:30 IST
ఉద్యమకారుడు ఉ.సాంబశివరావు ఉద్యమ జీవితంలో కులం, వర్గ దృక్పథంతో ఎన్నో పాటలు రాశారని, ఆయన మృతి
రాంనగర్: ఉద్యమకారుడు ఉ.సాంబశివరావు ఉద్యమ జీవితంలో కులం, వర్గ దృక్పథంతో ఎన్నో పాటలు రాశారని, ఆయన మృతి బహుజన ఉద్యమాలకు తీరని లోటని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఆదివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉ.సాంబశివరావు స్మారక కమిటీ ఆధ్వర్యంలో ఉసా ప్రథమ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఉ.సాంబశివరావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ బుద్ధుడు, ఫూలే, అంబేడ్కర్ల ఆశయ సాధన కోసం ఉ.సా. చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఉ.సా స్మారక కమిటీ అధ్యక్షుడు సి.ఎల్.ఎన్.గాంధీ, ప్రధాన కార్యదర్శి అమర్, డాక్టర్ చెరుకు సుధాకర్, మాష్టార్జీ, ఇంద్రవెల్లి రమేష్, జె.గౌతం, లక్ష్మీదేవి, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ప్రముఖ గాయకుడు జయరాజ్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.