సమీర్ వాంఖడే Bollywoodని టార్గెట్ చేయడం లేదు...భార్య క్రాంతి రెడ్కర్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-26T13:11:46+05:30 IST

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే భార్య, మరాఠీ సినీనటి క్రాంతి రెడ్కర్ తాజాగా వ్యాఖ్యలు చేశారు...

సమీర్ వాంఖడే Bollywoodని టార్గెట్ చేయడం లేదు...భార్య క్రాంతి రెడ్కర్ వ్యాఖ్యలు

ముంబై: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే భార్య, మరాఠీ సినీనటి క్రాంతి రెడ్కర్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. తన భర్త అయిన సమీర్ వాంఖడే బాలీవుడ్‌ను టార్గెట్ చేయడం లేదని ఆయన భార్య క్రాంతి రెడ్కర్ స్పష్టం చేశారు.ఆర్యన్ ఖాన్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్,  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్వతంత్ర సాక్షి ప్రభాకర్ సెయిల్ చేసిన వాదనలపై క్రాంతి స్పందించారు.తన భర్త బాలీవుడ్ ను టార్గెట్ చేయడం లేదని, అతను ప్రతి నెల ఆపరేషన్ చేసేందుకు గోవా వెళుతుంటాడని, గోవాలో సెలబ్రిటీలు లేరని క్రాంతి రెడ్కర్ చెప్పారు. 


తన భర్త సమీర్ నేరస్థులతో కఠినంగా వ్యవహరిస్తాడని ఆమె చెప్పారు. మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించినట్లు తాను ఎప్పుడూ దుబాయ్ వెళ్లలేదని క్రాంతి చెప్పారు.కాని సమీర్, తమ పిల్లలతో కలిసి మాల్దీవుల్లో పర్యటించామని చెప్పారు. మాల్దీవుల్లో తాము బస చేసిన ప్రాంతంలో సెలబ్రిటీలు ఎవరూ లేని క్రాంతి స్పష్టం చేశారు.తన భర్త సమీర్, తాను హిందువులమేనని, తాము ఇతర మతంలోకి మారలేదని చెప్పారు. సమీర్ 2016లో మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడని ప్రస్థుత భార్య క్రాంతి  చెప్పారు.


Updated Date - 2021-10-26T13:11:46+05:30 IST