కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

ABN , First Publish Date - 2021-01-06T00:14:54+05:30 IST

కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

కొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. నేపాల్ దేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎంవోఎస్2ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది.


నేపాల్ మార్కెట్‌లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎంవోఎస్2ఎస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 9,900 ఉంటుంది. అయితే భారత మార్కెట్‌లో జనవరి 7వ తేదీన కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎంవోఎస్2ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎంవోఎస్2ఎస్ స్మార్ట్‌ఫోన్‌ రూ. 10,000 లభించనుంది. 

Updated Date - 2021-01-06T00:14:54+05:30 IST