ఛార్జర్, ఇయర్ఫోన్స్ లేకుండానే గెలాక్సీ ఎస్21 స్మార్ట్ఫోన్స్ విడుదల
ABN , First Publish Date - 2021-01-16T02:17:20+05:30 IST
ఛార్జర్, ఇయర్ఫోన్స్ లేకుండానే గెలాక్సీ ఎస్21 స్మార్ట్ఫోన్స్ విడుదల
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఇప్పుడు అధికారికంగా విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21, ఎస్21 ప్లస్, ఎస్21 ఎల్ట్రా స్మార్ట్ఫోన్లకు ఛార్జర్, ఇయర్ ఫోన్స్ లేకుండా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది.
అయితే జనవరి 29 నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ స్మార్ట్ఫోన్ల విక్రయాలు ప్రారంభమవుతాయని శాంసంగ్ పేర్కొంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ స్మార్ట్ఫోన్ రూ.69,999 లభించనుంది. ప్రీ-ఆర్డర్లు జనవరి 15 నుంచి ప్రారంభమవుతాయని, ప్రీ-ఆర్డర్ కస్టమర్లకు జనవరి 25 నుంచి డెలివరీ లభిస్తుందని సంస్థ తెలిపింది.
అయితే సాధారణ అమ్మకాలు జనవరి 29 నుంచి శాంసంగ్.కామ్, అమెజాన్ ఇండియా ,ఫ్లిప్కార్ట్ ద్వారా ఇతర ఆన్లైన్ పోర్టల్లతో పాటు ఆఫ్లైన్ రిటైల్ దుకాణాల ద్వారా ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. ఇటీవల ఐఫోన్ బాక్సులలో ఇయర్ ఫోన్లు మరియు పవర్ ఎడాప్టర్లను ఆపివేసింది.