రెండు ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం
ABN , First Publish Date - 2020-12-04T04:45:06+05:30 IST
అనుమతులు ఒక చోటకు తీసుకొని మరోచోటకు వెళ్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఎస్ఈబీ అధికారులు గురువారం పట్టుకున్నారు.
తడ, డిసెంబరు 3 : అనుమతులు ఒక చోటకు తీసుకొని మరోచోటకు వెళ్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఎస్ఈబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లు దొరవారిసత్రంలోని డంప్ నుంచి ఇసుక లోడ్ చేసుకుని శ్రీసిటీ సెజ్కు బయలుదేరాయి. మార్గ మధ్యంలో రెండున్నర టన్ను ఇసుక చొప్పున ఒక చోట అన్లోడ్ చేసి మిగిలిన రెండు టన్నులతో రెండు ట్రాక్టర్లు మాంబట్టు గ్రామం వైపు వెళ్తుండగా ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లను, ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్స్టేషన్కు అప్పగించారు.