మేకలవానికాల్వ వద్ద ఇసుక డంపు ఖాళీ!
ABN , First Publish Date - 2022-06-25T05:20:52+05:30 IST
పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీ మేక లవాని కాల్వ సమీపంలో ఈ నెల 9వతేదీన బయటపడిన ఇసుక డంపు ఖాళీగా దర్శనమి స్తోంది.
పీలేరు, జూన్ 24: పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీ మేక లవాని కాల్వ సమీపంలో ఈ నెల 9వతేదీన బయటపడిన ఇసుక డంపు ఖాళీగా దర్శనమి స్తోంది. అక్కడ నిల్వ ఉన్న ఇసుకను ఇసుకాసురులు దరా ్జగా ఎత్తుకెళ్లిపోయారు. మేకలవానికా ల్వ సమీపంలోని పింఛానది నుంచి అక్రమంగా ఇసుకను తరలించడమే కా కుండా డంపుల రూపంలో నిల్వ చేసుకుం టున్న విషయాన్ని ఈ నెల 9న ‘ఆంధ్ర జ్యోతి’లో కథనం వెలువడింది. అదే రోజు ఆ డంపులను పీలేరు తహసీల్దారు రవి తన సిబ్బం దితో పరిశీలించి దానిని పరిరక్షించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. అయితే ఎవ్వ రూ పట్టించుకోకపోవడంతో డంపు చేసిన వారే దానిని ఎత్తుకెళ్లిపోయినట్లు స్థానికులు ఆరో పిస్తున్నారు. పస్తుతం ట్రాక్టరు ఇసుక ధర రూ.4500ల నుంచి రూ.5500ల దాకా పలుకుతుండడంతో ఇసుకాసురులే అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలున్నాయి.