ఇసుక క్వారీలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-06-27T06:30:42+05:30 IST
మానేరు వాగులోని ఇసుక క్వారీలను రద్దు చేయాలని మండలంలోని పొత్కపల్లిలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు.
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీ
ఓదెల, జూన్ 26: మానేరు వాగులోని ఇసుక క్వారీలను రద్దు చేయాలని మండలంలోని పొత్కపల్లిలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. మానేరు పరివాహక గ్రామాల్లో పంట పొలాలను వ్యవసాయ బావులను కాపాడాలని కనగర్తిలో కూడా రాస్తారోకో నిర్వహించారు. అలాగే ఇసుక లారీలతో రోడ్లన్ని ధ్వంసమయ్యాయని, ఆరోపిస్తూ రోడ్లను నిర్మించాలని గుండ్లపల్లి నుంచి మండల సరిహద్దు గ్రామమైన గుంపుల వరకు కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్రెడ్డి నాయకులు పడాల రాజు, బొంగోని శ్రీనివాస్, బోడకుంట శంకర్, రెడ్డి రజనికాంత్, పుప్పాల శంకర్, అంకం రమేష్, నిరంజన్రెడ్డి, చింతం కుమారస్వామి, పిట్టల నర్సింగం, క్యాతం వెంకన్న. తిప్పారపు సంపత్, రాగిడి రవిందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.