ఇసుక ట్రాక్టర్ల సీజ్‌

ABN , First Publish Date - 2021-10-27T05:49:23+05:30 IST

వాల్మీకిపురంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను మదనపల్లె ఎంవీఐ సుప్రియ సీజ్‌ చేశారు.

ఇసుక ట్రాక్టర్ల సీజ్‌

వాల్మీకిపురం, అక్టోబరు 26: వాల్మీకిపురంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను మదనపల్లె ఎంవీఐ సుప్రియ సీజ్‌ చేశారు. నాలుగు ట్రాక్టర్లు, రెండు కార్లను సీజ్‌ చేసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అలాగే రికార్డులు సక్రమంగా లేని పలు వాహనాలకు జరిమానాలు విధించారు. ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా వాహనాల తనిఖీలు పసిగట్టిన ఇసుక ట్రాక్టర్లు, అక్రమంగా కలపను తరలిస్తున్న వాహనాలు చాటుగా ఉంచి తనిఖీలన మదనపల్లె మార్గంలో వెళ్లడం గమనార్హం. ఈ తనిఖీలలో ఎస్‌ఐ బిందుమాధవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T05:49:23+05:30 IST