సంగారెడ్డి జిల్లా: ఓ స్కూల్లో 12 మంది బాలికలకు కరోనా

ABN , First Publish Date - 2021-02-28T17:10:07+05:30 IST

సంగారెడ్డి జిల్లా: గాంధీ బాలికల విద్యాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది.

సంగారెడ్డి జిల్లా: ఓ స్కూల్లో 12 మంది బాలికలకు కరోనా

సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం, కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఏకంగా 12 మంది బాలికలకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. తొలుత వారిలో ముగ్గురికి మాత్రమే కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారయంత్రాంగం స్కూల్లో ఉన్న అందరికి పరీక్షలు చేయించింది. మొత్తం 150 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. అందులో 132 మంది విద్యార్థులు, 18 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది అందరికీ నెగిటీవ్ రాగా.. 12 మంది బాలికలకు మాత్రమే పాజిటీవ్ వచ్చింది. వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ర్యాపిడ్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన వారందరికీ తిరిగి ఆర్టిపీసీఆర్ ద్వారా అధికారులు శాంపిల్స్ తీశారు. ఇంకా ఎంతమందికి పాజిటీవ్ వస్తుందోనని సిబ్బంది, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-02-28T17:10:07+05:30 IST