Tokyo Olympics: తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సానియా ద్వయం
ABN , First Publish Date - 2021-07-25T15:06:42+05:30 IST
టెన్నిస్ మహిళల డబుల్స్లో భారత్ పోరు తొలి రౌండ్లోనే ముగిసింది. సానియా మిర్జా, అంకితా రైనా జంటను ఉక్రెయిన్కు చెందిన కవలలు లియుడ్మిలా కిచెనోక్, నదియా కిచెనోక్ మట్టికరిపించారు. 6-0, 6-7, 8-10 తేడాతో ఉక్రెయిన్ జంట విజయం సాధించింది.
టోక్యో: టెన్నిస్ మహిళల డబుల్స్లో భారత్ పోరు తొలి రౌండ్లోనే ముగిసింది. సానియా మిర్జా, అంకితా రైనా జంటను ఉక్రెయిన్కు చెందిన కవలలు లియుడ్మిలా కిచెనోక్, నదియా కిచెనోక్ మట్టికరిపించారు. 6-0, 6-7, 8-10 తేడాతో ఉక్రెయిన్ జంట విజయం సాధించింది. తొలి సెట్ను సానియా ద్వయం 6-0తో కైవసం చేసుకోగా, ఆ తరువాతి రెండు సెట్లలో ఉక్రెయిన్ కవలలు విజయం సాధించారు. రెండో సెట్లో మొదట 5-3 తేడాతో లీడ్లో ఉన్న సానియా ద్వయం ఆ తరువాత అనూహ్యంగా వెనుకబడిపోయారు. క్రమంగా పుంజుకున్న ఉక్రెయిన్ జంట ఏకంగా విజయంతో ముగించింది. దీంతో సానియా మిర్జా, అంకితా రైనా మొదటి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు.