భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా షోయబ్ మాలిక్‌ను ‘జిజా జీ’ అని పిలిచిన అభిమానులకు Sania Mirza స్పందన ఏందంటే...

ABN , First Publish Date - 2021-10-26T16:39:23+05:30 IST

సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్‌ను ‘జిజాజీ’ లేదా బావ అని పిలుస్తున్నట్లు అభిమానుల సమూహం వినిపించిన వైరల్ వీడియోపై స్పందించింది....

భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా షోయబ్ మాలిక్‌ను ‘జిజా జీ’ అని పిలిచిన అభిమానులకు Sania Mirza స్పందన ఏందంటే...

దుబాయ్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్‌ వీడియోపై స్పందించింది. ‘జిజాజీ’ లేదా బావ అని అభిమానులు పిలిచిన వైరల్ వీడియోపై సానియా మీర్జా తాజాగా వ్యాఖ్యానించింది. టీ 20 వరల్డ్ కప్ 2021 మ్యాచ్‌లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ భారత్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం మ్యాచ్ జరుగుతున్నప్పుడు, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అభిమానుల గుంపు ‘జిజా జీ’ అని నినాదాలు చేసింది.షోయబ్ మాలిక్ 2010లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని పెళ్లాడినప్పటి నుంచి అభిమానులు మ్యాచ్ జరుగుతున్నపుడు జిజా జీ పదాన్ని తరచుగా ప్రస్తావిస్తున్నారు.


భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరిగినప్పటి నుంచి తొమ్మిది సెకన్ల క్లిప్ ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తోంది. ఇది మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో 4 లక్షలకు పైగా వ్యూస్ ను సంపాదించింది. ఈ వీడియో సానియా మీర్జా దృష్టిని కూడా ఆకర్షించింది.ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ సానియా మీర్జా నవ్వుతో కూడిన రెండు ఎమోజీలు, రెండు హృదయాల ఎమోజీలతో స్పందించారు.వ్యాఖ్యల విభాగంలో ‘‘క్రీడాస్ఫూర్తి, సహృదయత యొక్క ఈ ప్రదర్శనను పలువురు ప్రశంసించారు.’’ అని సానియామీర్జా సమాధానం ఇచ్చారు.



ఆసియా కప్ 2018లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. షోయబ్ మాలిక్ బౌండరీపై ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు భారత అభిమానులు అతన్ని పిలిచి ‘‘ఒక్కసారి ఇటు చూడండి’’ అని పిలిచారు. అభిమానుల పిలుపునకు స్పందించిన పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ వారి వైపు తిరిగి  చేతులు ఊపాడు. 



Updated Date - 2021-10-26T16:39:23+05:30 IST