Condoms కూడా అడుగుతారంటూ ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఫైర్ అయ్యారు కదా.. ఇప్పుడదే యువతికి ఓ కంపెనీ ఆఫర్ ఏంటంటే..
ABN , First Publish Date - 2022-10-01T23:35:36+05:30 IST
ఓ పేద యువతి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ బిహార్ మహిళాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశం మొత్తం చర్చనీయాంశంగా మారాయి.
ఓ పేద యువతి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ బిహార్ మహిళాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశం మొత్తం చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తీవ్రంగా పరిగణించింది. ఆ వ్యాఖ్యలపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆమెను కోరింది. తమకు ప్రభుత్వం రూ.20కే శానిటరీ ప్యాడ్స్ ఇవ్వొచ్చు కదా అని హర్జోత్ను రియా కుమారి అనే యువతి అడిగింది. దానికి హర్జోత్ స్పందిస్తూ.. `శానిటరీ ప్యాడ్స్ మాత్రమే కాదు.. కండోమ్స్ కూడా ఉచితంగా కావాలంటారు` అని బదులిచ్చారు. కాగా, హర్జోత్ను ప్రశ్నించిన యువతికి ఢిల్లీకి చెందిన శానీటరీ ప్యాడ్స్ తయారీ సంస్థ బంపరాఫర్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి..
Bihar: `కండోమ్లు కూడా ఉచితంగానే కావాలంటారు`.. యువతితో అనుచితంగా మాట్లాడిన IAS అధికారిణి..
రియాకుమారికి ఏడాదంతా తాము శానిటరీ పాడ్స్ ఉచితంగా ఇస్తామని, పైగా తన విద్యకయ్యే ఖర్చును భరిస్తామని ఢిల్లీకి చెందిన వెట్ అండ్ పర్సనల్ కేర్ సీఈవో హరిఓం త్యాగి ప్రకటించారు. ఈ సంస్థ శానిటరీ ప్యాడ్స్ను తయారు చేస్తుంటుంది. ఇండియాలో ఆడపిల్లలు పీరియడ్స్కు సంబంధించిన విషయాల గురించి బహిరంగంగా మాట్లాడడానికి భయపడతారని, కానీ, రియా అందరి ఎదుటా ధైర్యంగా శానిటరీ పాడ్స్ గురించి ప్రస్తావించిందని త్యాగి ప్రశంసించారు. రియాకుమారిని గ్రాడ్యుయేషన్ చదివించే బాధ్యత తీసుకుంటామని, భవిష్యత్తులో ఆమెకు మరే సహాయం అవసరమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని త్యాగి తెలిపారు.