నిర్లక్ష్యపు తుప్పు!!
ABN , First Publish Date - 2021-06-24T05:10:25+05:30 IST
నగర వాసులు చెత్త పోయడానికి ఏర్పాటు చేయాల్సిన కుండీలు, వ్యర్థాలను తరలించే తోపుడు బండ్లు, రోడ్లపై మట్టిని, దుమ్మును తొలగించే వాహనం..... పారిశుధ్య మెరుగునకు వినియోగించాల్సిన ఇలాంటి పరికరాలు, వాహనాలు నిరుపయోగంగా మూలనపడి ఉన్నాయి. స్వచ్ఛ నెల్లూరు, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అని నగరపాలక సంస్థ ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో చూపడం లేదు.
నిరుపయోగంగా మున్సిపల్ పరికరాలు
మూలనపడ్డ పారిశుధ్య వాహనాలు
నగరపాలక సంస్థ నిర్లక్ష్యం
రూ.లక్షల ప్రజాధనం వృథా
నగర వాసులు చెత్త పోయడానికి ఏర్పాటు చేయాల్సిన కుండీలు, వ్యర్థాలను తరలించే తోపుడు బండ్లు, రోడ్లపై మట్టిని, దుమ్మును తొలగించే వాహనం..... పారిశుధ్య మెరుగునకు వినియోగించాల్సిన ఇలాంటి పరికరాలు, వాహనాలు నిరుపయోగంగా మూలనపడి ఉన్నాయి. స్వచ్ఛ నెల్లూరు, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అని నగరపాలక సంస్థ ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో చూపడం లేదు. క్లీన్ సిటీగా నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దిడంలో నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇళ్ల నుంచే చెత్త సేకరణ, డస్ట్బిన్ రహిత నగరం అనే నినాదాలతో రోడ్లపై చెత్త కుండీలన్నింటినీ తొలగించారు. కానీ, నూతన విధానాన్ని పటిష్టం అమలు చేయకపోతుండటంతో చెత్తకుప్పలు రోడ్లపై దర్శనం ఇస్తున్నాయి. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన పరికరాలు నిర్వహణ లోపం కారణంగా తుప్పుపట్టి శిథిలమవుతున్నాయి. బారాషహీద్ దర్గాలోని శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద ఇవన్నీ మూలన పడి ఉన్నాయి.
- నెల్లూరు(సాంస్కృతికం)